BREAKING NEWS : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..నేడు ఆ టికెట్లు విడుదల

Breaking: Good news for Srivari devotees.. Vaikuntha Ekadashi tickets released
Breaking: Good news for Srivari devotees.. Vaikuntha Ekadashi tickets released

టిటిడి భక్తులకు అలర్ట్.. ఈనెల 19న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నట్లు టిటిడి తెలిపింది. ఇందులో పాల్గొనే భక్తుల కోసం నేడు 1000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. టికెట్ ధరను రూ.700గా నిర్ణయించింది.

కాగా…. టిటిడి ఈ ఏడాది డిసెంబర్ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా..శ్రీవారి సన్నధి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజు 66,048 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అటు 24,666 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.25 కోట్లుగా నమోదు అయింది.