ఈనెల 15న పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Election Updates: Birth certificate is now mandatory in AP
Election Updates: Birth certificate is now mandatory in AP

ఈనెల 15న పలనాడు జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటించనున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వరికపూడిసెల ప్రాజెక్టు పనులకు ఈ పర్యటనలో ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ తరుణంలో మాచర్లలోని రాయవరం జంక్షన్ లో అధికారులు భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు.

ఇక అటు ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. కరువు మండలాల ప్రకటనకు, పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడంపై ప్రతిపక్షాలు మరియు రైతుల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే.అయితే ఈ అంశంపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. అర్హులైన రైతులందరికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పంటల బీమా వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు .