క్రిష్‌, బాలయ్యల మద్య ఏం జరుగుతుంది?

cold war between Director Krish and Balakrishna

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకు వెండి తెర రూపం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెల్సిందే. క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ నటించబోతున్నాడు. తన తండ్రి జీవితాన్ని మొత్తం పాజిటివ్‌గా, ఉన్నంతగా చూపించాలని బాలకృష్ణ భావిస్తున్నాడు. అయితే ప్రతి మనిషిలో కూడా బ్యాడ్‌ ఉంటుంది. ఆ బ్యాడ్‌ అనేది ఎన్టీఆర్‌ జీవితంలో కూడా ఉంది. అయితే ఆ బ్యాడ్‌ను బాలకృష్ణ చూపించేందుకు ఆసక్తి చూపడం లేదు. కాని క్రిష్‌ మాత్రం మంచి, చెడు చూపించినప్పుడు మాత్రమే సినిమా సక్సెస్‌ అవుతుందని, మొత్తం పాజిటివ్‌గా చూపిస్తే అదేదో డాక్యుమెంటరీ టైప్‌లో వస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. అయినా కూడా బాలయ్య ఏమాత్రం నెగిటివ్‌కు ఓకే చెప్పడం లేదు.

నెగటివ్‌గా సినిమాలో చూపించినట్లయితే ఫ్యాన్స్‌ మరియు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు అంటూ బాలకృష్ణ అంటున్నాడట. ఈ విషయం పై బాలకృష్ణ మరియు క్రిష్‌ల మద్య కోల్డ్‌ వార్‌ జరుగుతుందని, ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు, పై చేయి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే చిత్రీకరణ మొదలు కావాల్సి ఉంది. కాని చిత్రీకరణ మొదలు అవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చిత్రంకు మొదట తేజను అనుకుని తప్పించిన బాలకృష్ణ ఇప్పుడు క్రిష్‌ను కూడా తొలగిస్తాడా ఏంటీ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి క్రిష్‌, బాలయ్యల మద్య కోల్డ్‌ వార్‌ వల్ల సినిమా ఆగిపోనుందా అంటూ ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇద్దరి మద్య ఏం జరుగుతందో అనే విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఫ్యాన్స్‌ కోరుతున్నారు.