Crime: ఇద్దరు బాలుర మధ్య ఘర్షణ… ఒకరు మృతి

Crime: Clash between two boys... one killed
Crime: Clash between two boys... one killed

స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీయగా ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని జాకీర్ హుస్సేన్నగర్కు చెందిన ఫరీద్ (14), ఓ బాలుడు స్నేహితులు. వారు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఫరీద్ తీరు సరిగా లేదని గుర్తించిన స్నేహితుడు అతని తల్లిదండ్రులకు చెప్పారు. తన గురించి చెడుగా చెబుతున్నాడని ఫరీద్ కక్ష పెంచుకుని నిత్యం గొడవలకు దిగి కొట్టుకునేవారు.

ఈ నేపథ్యంలో ఆదివారం సత్య నారాయణపురంలోని ఓ పాఠశాల సమీపంలో ఉన్న క్రీడామైదానంలో క్రికెట్ ఆడుకుంటుండగా మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. ఫరీద్ దూషించడాన్ని జీర్ణించుకోలేని స్నేహితుడు దాడి చేశాడు. చేత్తో మెడపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలుణ్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి వాజిద్ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.