Crime: తిరుపతిలో విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

Crime: Tragedy in Tirupati.. Car collided with a bus.. Two killed
Crime: Tragedy in Tirupati.. Car collided with a bus.. Two killed

తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. బస్సును కారు కొట్టడంతో..ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ సంఘటన లో ఇద్దరు మృతి చెందారు. అలాగే.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న బస్సును కారు ఢీకొట్టింది.

బస్సు పంచర్ కావడంతో జాకీ కోసం బస్సు వెనుకకు డ్రైవర్ వెళ్లాడు. అయితే… అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు బస్సు డ్రైవర్. ఇక కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాడేపల్లి గూడెం నుంచి చెన్నైకి కారు వెళుతోంది. అటు క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.