అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

Good news for Allu Arjun fans!
Good news for Allu Arjun fans!

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ గా పుష్ప ది రూల్ (pushpa the rule) సినిమా చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో రష్మిక మందన్న (rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానున్నది . ఇక ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హారికా హాసిని మూవీస్ వారు నిర్మించనున్న సినిమా అనౌన్స్ చేసారు అల్లు అర్జున్.

అలానే కోలీవుడ్ యంగ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా \ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందంట . అయితే పుష్ప 2 అనంతరం దీనినే అల్లు అర్జున్ చేస్తారని టాక్ కూడా నడుస్తోంది. కాగా ఈ రెండు మూవీ లలో నెక్స్ట్ పక్కాగా అల్లు అర్జున్ ఏ మూవీ చేస్తారు అనే దాని పై ఆయన పుట్టిన రోజున ఏప్రిల్ 8 నాడు క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా, బోయపాటి శ్రీను లతో కూడా అల్లు అర్జున్ మూవీ లు చేయనున్నారు .