క్రిష్‌ ఒప్పుకున్నాడట.. కాని ఇప్పుడు కాదు!

director krish to direct ntr biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

నందమూరి బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘ఎన్టీఆర్‌’ చిత్రం ఆగిపోయిందని అంతా భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ సినిమాను పక్కకు పెట్టి బాలకృష్ణ ప్రస్తుతం తనకు గతంలో రెండు సక్సెస్‌లు ఇచ్చిన వినాయక్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు బాలయ్య సిద్దం అయ్యాడు. దాంతో ఎన్టీఆర్‌ సినిమాను బాలకృష్ణ పూర్తిగా పక్కకు పెట్టాడని కొందరు, ఎన్టీఆర్‌ సినిమా చేసే దమ్ము లేదంటూ మరి కొందరు ఇలా పలు రకాలుగా విమర్శలు చేసిన నేపథ్యంలో తాజాగా మరో వార్త ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన ఎన్టీఆర్‌ సినిమాను పూర్తిగా పక్కకు పెట్టినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, ఈ చిత్రం కోసం దర్శకుడు క్రిష్‌ను బాలయ్య ఒప్పించాడు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని క్రిష్‌ తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో క్రిష్‌పై బాలయ్యకు గురి ఏర్పడటం జరిగింది. అందుకే తన తండ్రి జీవిత చరిత్ర సినిమా అనుకున్న వెంటనే క్రిష్‌ను దర్శకుడిగా భావించాడు. కని దర్శకుడు క్రిష్‌ మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం తన సినిమాతో బిజీగా ఉన్నాను అని, ఎన్టీఆర్‌ అంటే తనకు అభిమానం ఉన్నా కూడా ప్రస్తుతానికి ఆ పని చేయలేను అంటూ తేల్చి చెప్పాడు. దాంతో బాలయ్య తేజను అప్రోచ్‌ అవ్వడం, ఆయన మద్యలో వదిలేసి వెళ్లడం జరిగింది. క్రిష్‌ ఈ సినిమా చేస్తానంటూ హామీ ఇచ్చాడు. కాని ఇప్పటికిప్పుడు చేయలేను అని, కాస్త సమయం కావాలని బాలయ్యను కోరాడు. అందుకే వినాయక్‌తో సినిమాను బాలయ్య షురూ చేయబోతున్నాడు.