Election Updates: ప్రజాగళం’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న చంద్రబాబు

Election Updates: Chandrababu will visit Kuppam for the second day today..
Election Updates: Chandrababu will visit Kuppam for the second day today..

మరి కొన్ని రోజులలో ఏపీలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కసరత్తులను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. ఇప్పటికీ రా కదలిరా, జండా సభ పేరుతో వివిధ కార్యక్రమాల్ని నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.

ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు నాయుడు కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మార్చి 6 నుంచి వరుసగా ఐదు రోజులపాటు ‘ప్రజాగళం’ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇక మొదటిరోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో ‘ప్రజాగళం’ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మార్చి 4న రాప్తాడు సభతో చంద్రబాబు నాయుడు రా కదలిరా సభలు ముగియనున్నాయి. అనంతరం ‘ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.