Election Updates: జనసేన స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన జనసేనాని

Election Updates: JanaSena announced Jana Sena star campaigners
Election Updates: JanaSena announced JanaSena star campaigners

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, సినీ నటులు సాగర్, పృథ్వీ , హైపర్ ఆది, గెటప్ శ్రీనులను ప్రచారకర్తలుగా నియమించారు.

తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు 3 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు