Election Updates: నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్

Election Updates: Kandula Durgesh as Nidadavolu Janasena candidate
Election Updates: Kandula Durgesh as Nidadavolu Janasena candidate

జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నిడదవోలు జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ఫైనల్‌ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది జనసేన. వాస్తవానికి రాజమండ్రి రూరల్ టికెట్ కావాలని కందుల దుర్గేష్ మొదటి నుంచి కోరారు. కానీ నిడదవోలు జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ఫైనల్‌ చేసింది.

కాగా, ఇవాళ టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం జరుగనుంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం ఉంటుంది.ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తు ఉండనుంది. మూడు పార్టీల అగ్ర నేతల భేటీలో పాల్గొననున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.ఇప్పటికే షెకావత్ – పవన్ మధ్య భేటీ జరిగింది.