సర్వత్రా ఉత్కంఠ, పూరి మీదే అందరి దృష్టి

excise-sit-first-inquiry-on-director-puri-jagannadh-over-drugs-case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డ్రగ్స్‌ వాడుతున్నట్లుగా అనుమానాలు ఉన్న వారికి ఎక్సైజ్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. డ్రగ్స్‌ డీలర్‌ కెల్విన్‌ వద్ద పలువురి ప్రముఖుల పేర్లను పోలీసులు గుర్తించారు. పోలీసులు నేటి నుండి నోటీసులు పంపించిన వారిని ఎంక్వౌరీ చేస్తూ ఉన్నారు. మొదటగా పూరి జగన్నాధ్‌ను నేడు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కెల్విన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న పూరి నుండి మరిన్ని విషయాలను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు అధికారులు పూరిని తమదైన శైలిలో ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.

పూరి నుండి అన్ని వివరాలను రాబట్టి, తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోనున్నారు. పూరి ఒక వేళ తాను డ్రగ్స్‌ తీసుకోలేదని వాదించినట్లయితే అతడికి రక్త పరీక్ష కూడా చేయించే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తుంది. పూరి జగన్నాద్‌ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సెలబ్రెటీలకు డ్రగ్స్‌ను అలవాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అదే కనుక నిజం అయ్యి, ఒక వేళ పూరి నోరు విప్పి ఆ ప్రముఖుల పేర్లు చెబితే కొంప కొళ్లేరు అవడం ఖాయం అంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి పూరి ఎంక్వౌరీ ఎలా జరుగుతుంది, ఆయన ఎవరి పేర్లు చెబుతాడు, అక్కడే అరెస్ట్‌ అవుతాడా, బయటకు వస్తాడా ఇలా ఎన్నో రకాల చర్చలు సోషల్‌ మీడియాలో, సినీ వర్గాల్లో జరుగుతుంది. మొత్తానికి ఇండస్ట్రీ మరియు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఉత్కంఠ భరితంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు: