సినీ ఇండస్ట్రీలో గాయనీగాయకులు సాధారణంగా తమ పనికే పరిమితమై, వివాదాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా గీతా మాధురి అలాంటి వారిలో ఒకరని అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సైలెంట్గా ఉండే ఆమె, తాజాగా మాత్రం టాలీవుడ్ స్టార్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి నెట్టింట హాట్ టాపిక్గా మారారు.
ఇటీవల సింగర్ నోయెల్ హోస్ట్ చేస్తున్న ఓ యూట్యూబ్ టాక్ షోకి గీతా మాధురి అతిథిగా హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడుతూ, ఇండస్ట్రీలో దాగి ఉన్న కొన్ని సీక్రెట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా తాను బయట కాఫీ షాపులకు వెళ్లడం చాలా అరుదని, కానీ ఎప్పుడైనా వెళ్లినప్పుడు మాత్రం ఎవరో ఒక సెలబ్రిటీ జంట రెడ్ హ్యాండెడ్గా కనిపిస్తూనే ఉంటారని ఆమె వెల్లడించారు.
“నేను వెళ్లిన ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డంగా దొరుకుతారు. ఒకవేళ నేను చూసిన ఆ సీక్రెట్స్ గురించి నోరు విప్పితే.. ఇండస్ట్రీలో చాలామంది కాపురాలు కూలిపోవడం ఖాయం” అంటూ గీతా మాధురి నవ్వుతూనే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి కాంట్రవర్సీలకు దూరంగా ఉండే గీతా మాధురి నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆమె కాఫీ షాపుల్లో చూసిన ఆ సీక్రెట్ సెలబ్రిటీ కపుల్స్ ఎవరు? అని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె మాటలతో ఇండస్ట్రీలో కొన్ని వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొందన్నది ఇన్సైడ్ టాక్.
