ఏపీ రైతులకు గుడ్ న్యూస్..17న లంక రైతులకు పట్టాలు

Good news for AP farmers
Good news for AP farmers

ఏపీ రైతులకు గుడ్ న్యూస్..ఈనెల 17న లంక భూముల రైతులకు సీఎం జగన్ పట్టాలు ఇవ్వనున్నారు. ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 9062 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో 17,768 మంది కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. ఇక అటు సామాజిక పెన్షన్లపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు అర్హులు ఉంటే అందులో ఒక్కరికే పెన్షన్ ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ లో తెచ్చిన జీవోలో జోక్యం చేసుకోలేని స్పష్టంచేసింది. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అంటూ పిల్ ను వేసింది. అయితే కుటుంబంలో వితంతు, వృద్ధాప్య పెన్షన్ తో పాటు 80%కి పైగా అంగవైకల్యం, డయాలసిస్ బాధితులకు పెన్షన్ ఇస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.