World Cup 2023: భారత్‌,న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌..3 నగరాల్లో భారీ స్క్రీనులు

World Cup 2023: India, New Zealand semis match.. Huge screens in 3 cities
World Cup 2023: India, New Zealand semis match.. Huge screens in 3 cities

ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ 2023లో భాగంగా న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య బుధవారం మొదటి సెమీస్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని వాంఖడే మైదానంలో ఆరంభం కానుంది. సెమీస్‌ మ్యాచ్‌ వీక్షించడం కోసం క్రికెట్ ఫాన్స్ ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అభిమానుల కోసం భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తోంది.

న్యూజిలాండ్‌, భారత్‌ సెమీస్ మ్యాచ్ కోడం AIA ఆధ్వర్యంలో విశాఖపట్నం, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో, కడపలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో, విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా AIA అధికారులు స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోచోట సుమారు 10 వేల మంది వీక్షించనున్నారు. భారీ స్క్రీన్లపై సెమీస్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉచితం ప్రవేశం కల్పించనున్నారు.