ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. దసరా స్పెషల్.. !

Good news for AP travelers.. Dussehra special.. !
Good news for AP travelers.. Dussehra special.. !

దసరా పండుగ వస్తోంది. అయితే..దసరా పండుగ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. దసరా సందర్భంగా 5,500 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించిన APSRTC మరో శుభవార్త చెప్పింది.

రాను, పోను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10% రాయితీ లభిస్తుందని అధికారులు తెలిపారు. చిల్లర సమస్య లేకుండా అన్ని ప్రత్యేక బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్, ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా టికెట్లు తీసుకునేలా స్వైపింగ్ మిషన్లు ఉంటాయని చెప్పారు.

కాగా, దసరా పండుగకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. స్కూల్ మరియు కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేసింది. మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా సెలవులు ఉంటాయని వెల్లడించింది. ఈ సెలవులు అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉంటాయి.