రజనీ గాలి తీసేసిన సర్వే

In Tamil Nadu, the Rajani CM needs only 11% of Tamil Nadu.

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

రజనీ రాజకీయాల్లోకి వస్తే చాలు ఆయన చాలా ఈజీగా సీఎం అయిపోతారు. ఇది రజనీ అభిమానుల లెక్క. కానీ రజనీ రాజకీయాల్లో చూపే ప్రభావంపై ఓ విద్యాసంస్థ చేసిన సర్వేలో తలైవాకు షాక్ కొట్టేలా ఫలితాలు వచ్చాయి. రజనీ సీఎం కావాలని తమిళనాడులో కేవలం 11 శాతం మందే కోరుకుంటున్నారట. అదే పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి అవ్వాలని 13 శాతం మంది చెబుతున్నారట. రజనీ కన్నా పన్నీరు ముందుండటం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదు.

ఇంతకూ తమిళ ప్రజల దృష్టిలో తిరుగులేని నేత ఎవరంటే స్టాలిన్ అట. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాలిన్ అయితేనే తమిళనాడుకు సుస్థిర పాలన అందించగలరని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అందుకే స్టాలిన్ ను సీఎంగా కోరుకునే వారి సంఖ్య 59 శాతంగా ఉంది. ఈ సర్వే చూసి డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఇది నిజంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి.

రజనీ క్రేజ్ తో పోలిస్తే.. స్టాలిన్ పై నమ్మకం తక్కువనే అనుకోవాలి. అయినా సరే సర్వేలో ఇలాంటి ఫలితాలు వచ్చాయంటే.. ఇందులో డీఎంకే హస్తం ఉందని అన్నాడీఎంకే వర్గాలు, రజనీ అభిమానులు భావిస్తున్నారు. లేదంటే కేంద్రమే కుట్ర పూరితంగా స్టాలిన్ ను ముందుంచుతుందేమోనని కూడా డౌట్స్ ఉన్నాయి. ఏదేమైనా తాజా సర్వే తమిళనాడులో హాట్ న్యూస్ గా మారింది.

మరిన్ని వార్తలు