IPL 2024: ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత..ఎందుకో తెలుసా ..!

IPL 2024: Tension near Uppal Stadium..!
IPL 2024: Tension near Uppal Stadium..!

IPL 2024: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేకున్నది ఐపీఎల్‌ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నిరసనకి దిగింది. స్టేడియం గేట్లు తోసుకొని లోపటికి వెళ్లారు విద్యార్థి సంఘాలు. లోపలికి వెళ్ళే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి ,విద్యార్థి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది . స్టేడియం మెయిన్ గేటు వద్ద బైఠాయించారు ఏఐవైఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నాయకులు.

IPL 2024: Tension near Uppal Stadium..!

IPL 2024: Tension near Uppal Stadium..!

అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో టికెట్ల విషయంలో బ్లాక్ గంద కొనసాగుతుందని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సత్యప్రసాద్ ఆరోపించాడు . ఉప్పల్ హెచ్సీఏ క్రికెట్ ఉప్పల్ స్టేడియం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లకాడ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ కేవలం 20 నిమిషాల వ్యవధిలో 70 వేల టికెట్లు ఏ విధంగా అమ్ముడుపోతాయని ప్రశ్నించాడు . దీంతో క్రికెట్ అభిమానులు తమకి టికెట్లు దొరకక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఏప్రిల్ 25న జరిగే క్రికెట్ మ్యాచ్ ని క్రికెట్ అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.