ఎన్టీఆర్‌ శతమానంభవతి వర్కౌట్‌ అయ్యేనా?

Is Jr Ntr accepts dil raju Srinivasa Kalyanam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దిల్‌రాజు కథలు ఎంపిక చేసుకోవడంలో, ఆ కథలకు హీరోలను ఎంపిక చేసుకోవడంలో ఆరితేరిన వ్యక్తి. ఏ కథకు ఏ హీరో అయితే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందో దిల్‌రాజు చెప్పినంతగా ఇండస్ట్రీలో ఏ నిర్మాత చెప్పలేడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి, బాలయ్యల వంటి స్టార్‌ హీరోలతో తాను నిర్మించిన ‘శతమానంభవతి’ సినిమాను వదిలి ఆ సినిమాపై తనకు ఎంత నమ్మకం ఉందో వచ్చిన కలెక్షన్స్‌ ద్వారా నిరూపించాడు. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా సంక్రాంతి పోటీని తట్టుకుని బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను సాధించింది. ఇప్పుడు అదే సతీష్‌ వేగేశ్వ అచ్చు అదే తరహా ఫ్యామిలీ కథను సిద్దం చేశాడు.

సతీష్‌ వేగేశ్న రెడీ చేసిన ఆ ఫ్యామిలీ కథతో మెగా సాయి ధరమ్‌ తేజ్‌తో దిల్‌రాజు ‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్‌తో సినిమాను నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. దిల్‌రాజు కూడా మొదట మెగా హీరోతో అనుకున్నాడు. కాని కథ అంతా పూర్తి అయిన తర్వాత ఆ కథకు ఎన్టీఆర్‌ అయితేనే బెస్ట్‌ అనే నిర్ణయానికి వచ్చాడు. ఎన్టీఆర్‌ ఎప్పుడు ఓకే అంటే అప్పుడే ఆ కథను తెరకెక్కించాలని, మరో హీరోతో శ్రీనివాస కళ్యాణంను చేసే ఆలోచనను తీసేశాడు. త్వరలోనే ఎన్టీఆర్‌కు సతీష్‌ వేగేశ్న రెడీ చేసిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా కథను వినిపించబోతున్నాడు. ఎన్టీఆర్‌ తప్పకుండా ఒప్పుకుంటాడనే నమ్మకంతో దిల్‌రాజు ఉన్నాడు. ఒక వేళ ఎన్టీఆర్‌ ఈ ఫ్యామిలీ ఎమోషన్‌ డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తాడా అంటూ ఇప్పటి నుండే చర్చ మొదలైంది. దిల్‌రాజు నమ్మకంగా ఉన్నాడంటే ఖచ్చితంగా సినిమా ఆడుతుందనే నమ్మకం కొందరిలో ఉంది. చూద్దాం అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

మరిన్ని వార్తలు:

యుద్ధం శరణం… తెలుగు బులెట్ రివ్యూ

కుశ టీజర్‌ వచ్చేసింది …ఎన్టీఆర్ అదుర్స్

మేడ మీద అబ్బాయి… తెలుగు బులెట్ రివ్యూ