జగపతిబాబుకు ఓటేసిన ఎన్టీఆర్‌

Jagapathi Babu Villain for NTR in Trivikram Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’కి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్‌ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చాడు. పవన్‌ 25వ చిత్రం అని ఫ్యాన్స్‌ భారీ ఆశలు పెట్టుకుంటే వారి ఆశలను అడియాశలు చేశాడు. అజ్ఞాతవాసి సక్సెస్‌ అయితే ఎన్టీఆర్‌తో సినిమా ఇప్పటికే సగం పూర్తి అవ్వాల్సి ఉంది. కాని ఆ సినిమా ఫ్లాప్‌ అయిన కారణంగా స్క్రిప్ట్‌ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్‌ సలహాలు మరియు సూచనలు కూడా త్రివిక్రమ్‌ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మామూుగా అయితే విలన్‌ను బాలీవుడ్‌ లేదా ఇతర భాషల నుండి త్రివిక్రమ్‌ పట్టుకు వస్తాడు. కాని ఎన్టీఆర్‌ సలహా మేరకు జగపతిబాబును ఎంపిక చేయడం జరిగింది.

ఎన్టీఆర్‌ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో విలన్‌గా జగపతిబాబు నటించాడు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, ఆ చిత్రంలో జగపతిబాబు నటన అద్బుతం అంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్టీఆర్‌, జగపతిబాబుల కాంబో సీన్స్‌ హైలైట్‌గా నిలిచాయి. అందుకే మరోసారి జగపతిబాబుతో తలపడాలని ఎన్టీఆర్‌ భావించాడు. అందుకే త్రివిక్రమ్‌కు చెప్పి మరీ జగపతిబాబును విలన్‌గా ఎంపిక చేయించాడు. మొదటి సారి జగపతిబాబును త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో సినీ వర్గాల వారిలో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈనెల చివర్లో లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతుంది. హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసిన త్రివిక్రమ్‌ ఒక సీనియర్‌ హీరోయిన్‌ను ఎన్టీఆర్‌ తల్లి పాత్రకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సీనియర్‌ హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.