షాక్‌.. మహానటితో మహేష్‌

keerthy suresh heroine as mahesh 25 film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఈ మద్య వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత చాలా గ్యాప్‌ వచ్చింది. ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేసేందుకు సంవత్సరం వ్యవధిలోనే మూడు సినిమాలను తీసుకు వచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ఈ దసరాకు ‘స్పైడర్‌’ చిత్రాన్ని విడుదల చేయబోతున్న మహేష్‌బాబు వచ్చే సంవత్సరం సంక్రాంతికి ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక వచ్చే సంవత్సరం దసరాకు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తన 25వ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మహేష్‌25 చిత్రం ప్రారంభం అయ్యింది.

‘ఊపిరి’ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి ఎట్టకేలకు తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు. అశ్వినీదత్‌, దిల్‌రాజులు మొదటి సారి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్‌బాబు కొత్తగా కనిపించబోతున్నాడని దర్శకుడు వంశీ చెబుతున్నాడు. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. తమిళంకు చెందిన కీర్తి సురేష్‌ ఇటీవల టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయ్యింది. అందుకే ఆమెను ఈ చిత్రంలోకి తీసుకునేందుకు మహేష్‌బాబు అంగీకరించాడు. ‘మహానటి’ చిత్రంతో పాటు పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెల్సిందే. కీర్తి సురేష్‌ ఇంకా పలువురు స్టార్‌ హీరోలకు జోడీగా సంతకాలు చేసేందుకు సిద్దం అవుతుంది. మొత్తానికి మహేష్‌బాబుతో కీర్తి సురేష్‌ జోడీ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు:

మహేష్‌బాబు కెరీర్‌లో మొదటి సారి..!

బాబోయ్‌ కొరటాల ఏంటి ఇది?