శ్రీశైలంలో వైభవంగా లక్ష దీపోత్సవం

Lakshadweep festival in Srisailam
Lakshadweep festival in Srisailam

నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక మాసం చివరి సోమవారం లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. పుష్కరిణి మెట్లపై లక్ష కార్తిక దీపాలను దేవస్థానం సిబ్బంది ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. పుష్కరిణి వేదికపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లకు అర్చకులు దశవిధ హారతులు సమర్పించి పూజలు చేశారు. అనంతరం భక్తులు, స్థానికులు పుష్కరిణి వద్ద కార్తిక దీపాలు వెలిగించి భక్త పరవశులయ్యారు.