విలేజ్ కు చాలా ఖర్చు చేస్తున్న “మహర్షి”

వంశీ పైడి పల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహర్షి అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఇటివల న్యూయార్క్ లో షూటింగ్ పూర్తి చేసుకొన్ని హైదరాబాద్ కు వచ్చినా సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో మహర్షీ సినిమా కోసం వేసిన విలేజ్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ బాబు మరియు ప్రధాన పాత్రలపైన పైన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విలేజ్ నేపధ్యంలో వచ్చే సన్నివేశంలో మహేష్ రైతు గా నటిస్తున్నాడు.

విలేజ్ కు చాలా ఖర్చు చేస్తున్న "మహర్షి" - Telugu Bullet

ఆంధ్రలోని కొన్ని గ్రామీణ ప్రాంతలో షూటింగ్ చెయ్యాలని అనుకున్నారంట. కానీ మహేష్ కు ఉన్నా ఫాన్స్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఏమైనా అంతరాయం కలగవచ్చు అని భావించి, నిజమైన విలేజ్ సెట్ ను రామోజీ ఫిలిం సిటీ లో వేశారంట. ఈ సెట్ కి మొత్తం 8 కోట్లు దాక ఖర్చు వచ్చిందంట. న్యూ యార్క్ షెడ్యూల్ లో మహేష్ బాబు ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ కి సీఈఓ గా నటిస్తున్నాడు. ఇక్కడ ఇండియా షెడ్యూల్ లో విలేజ్ రైతు గా నటించడం తో సినిమా పైన అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ సరసన పూజ హెగ్డే కథానాయకగా నటిస్తుంది. అల్లరి నరేష్ ఓ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.