మనకు సిగ్గు లేదంటున్న మాధవిలత!

madhavi latha comments on TS govt Over Ivanka Trump Hyderabad visit

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల సినిమా వారు రాజకీయాలను ఎక్కువగా మాట్లాడటం మనం చూస్తున్నాం. హీరోలు, దర్శకులు రాజకీయాలు, ప్రభుత్వం గురించి ఇప్పటి వరకు మాట్లాడారు. తాజాగా మాత్రం హీరోయిన్‌ మాధవి లత తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడటం జరిగింది. తాజాగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు కోసం అమెరికా నుండి ఇవాంక ట్రంప్‌ వచ్చిన విషయం తెల్సిందే. ఆమె రాక సందర్బంగా ఆమె ప్రయాణించిన రోడ్లు అత్యంత సుందరంగా తీర్చి దిద్దడం జరిగింది. రోడ్లు బాగు చేయడంతో పాటు, రోడ్డు పక్కన పెయింటింగ్స్‌ వేయడం జరిగింది. 

Telangana-Government

ఈ విషయమై మాధవి లత కాస్త ఘాటుగా స్పందించింది. అతిథులు వచ్చినప్పుడు మాత్రమే హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ఉన్న వారికి ఏమాత్రం విలువ లేదా, ఇక్కడ ఉన్న వారికి కనీస గౌరవం లేకుండా చేస్తున్నారు. అమెరికా నుండి అతిథి వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అదే మన ప్రెసిడెంట్‌ అమెరికాకు వెళ్తే వారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు. అక్కడ అందరికి ఒకే రకమైన ఏర్పాట్లు ఉంటాయి. కాని ఇక్కడ మాత్రమే అతిథును ఒకరంగా, స్థానికులను ఒకరకంగా చూస్తారు. అయినా మనకు సిగ్గు లేదు, మనం ఇలాంటి నాయకులను మాత్రమే ఎంచుకుంటూ ఉన్నాం. వారికి పదే పదే ఓట్లు వేసి గెలిపిస్తున్నాం అంటూ మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేసింది.

madhavi-latha-comments-on-t