వరుసగా 3 సార్లు..

Filmfare Awards 3 times in a row .Allu Arjun,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Megha Fans Talks About Dj Movie In Film Fare Awards

అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ చిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్‌ క్రిటిక్‌ ఉత్తమ నటుడిగా ఎన్నికైన విషయం తెల్సిందే. ఉత్తమ నటుడిగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి గాను ఎన్టీఆర్‌ ఎన్నిక అవ్వగా, అల్లు అర్జున్‌ మరో ఉత్తమ నటుడిగా ‘సరైనోడు’ చిత్రానికి గాను ఎన్నిక అవ్వడం జరిగింది. వరుసగా మూడు సంవత్సరాలకు గాను మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్న హీరోగా అల్లు అర్జున్‌ నిలిచాడు. గత రెండు సంవత్సరాలతో పాటు ఈ సంవత్సరంలో కూడా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకుని మెగా ఫ్యాన్స్‌కు కానుకగా ఇచ్చాడు.

2015లో ‘రేసుగుర్రం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్‌ అందుకున్నాడు. ఇక 2016లో ‘రుద్రమదేవి’ చిత్రంలో నటించినందుకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సంవత్సరం ‘సరైనోడు’ చిత్రంతో ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇలా వరుసగా మూడు సంవత్సరాలకు గాను అవార్డులు తీసుకోవడం తెలుగు హీరోల్లో అల్లు అర్జున్‌కు మాత్రమే సాధ్యం అయ్యింది. అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రానికి గాను వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా అవార్డును సొంతం చేసుకుంటాడనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ‘డీజే’ చిత్రం వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు

మళ్లీ ఎన్టీఆర్‌ను వాడాలని బాబు ప్లాన్‌