రోజా మరో కత్తి మహేష్‌ అయ్యిందా?

MLA Roja another time comments on Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే వెంటనే ఫేమస్‌ అయ్యి పోవచ్చు అనే ఉద్దేశ్యమో లేక మరేంటో కాని గత కొంత కాలంగా కత్తి మహేష్‌ పవర్‌ స్టార్‌ను ఏదో విధంగా కార్నర్‌ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నాడు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇండైరెక్ట్‌గా కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై స్పందించాడు. ఇక ఇప్పుడు కత్తి మహేష్‌లాగే ఎమ్మెల్యే రోజా కూడా పవన్‌ కళ్యాణ్‌పై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. తమ అధినేత జగన్‌ను వారసత్వ రాజకీయ వేత్త అంటూ విమర్శించడం నీకు తగదు అంటూ పవన్‌పై దాడి మొదలు పెట్టిన రోజా ఆ దాడిని కొనసాగిస్తూనే ఉంది. చిరంజీవి వల్లే నీకు ఈ స్థాయి అంటూ రోజా పవన్‌పై ఆగ్రహంను వ్యక్తం చేసింది.

roja-comments-on-janasena

ఆ వ్యాఖ్యలు మరవక ముందే మరో సారి పవన్‌పై రోజా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక తెలుగు దేశం నాయకుడు పవన్‌ కళ్యాణ్‌కు గుండు కొట్టించాడు అంటూ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో నిజం ఎంత, అబద్దం ఎంతా అంటూ ఇంత కాలం రాజకీయ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్‌ ఆ విషయమై స్పందిస్తూ అసలు తనకు ఎవరు గుండు కొట్టించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో గుండు ప్రచారంపై క్లారిటీ వచ్చింది. అయితే ఈ సమయంలో రోజా ఆ విషయం మళ్లీ చర్చకు తెర లేపింది. పవన్‌ కళ్యాణ్‌కు గుండు కొట్టించారు అంటూ ప్రచారం జరిగినప్పుడు తాను టీడీపీలో ఉన్నాను అని, పవన్‌కు గుండు కొట్టించారు అంటూ రోజా చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలా పవన్‌పై విమర్శలు చేస్తూ, పవన్‌ విషయాల్లో స్పందించడం వల్ల రోజాకు భారీగా పబ్లిసిటీ దక్కుతుంది.