నైజాంలో బన్నీ రికార్డు కొట్టాడు

naa Peru Surya Nizam Rights Sold For Record Price

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌ హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ఇటీవలే విడులైన ఫస్ట్‌ ఇంపాక్ట్‌ వీడియో సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది. సినిమా బన్నీ కెరీర్‌లో నిలిచిపోయేలా ఉంటుందని ఇప్పటికే టాక్‌ వినిపిస్తుంది. దాంతో అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రాన్ని కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు బన్నీ ఏ చిత్రం అమ్ముడు పోని రేంజ్‌లో ఈ చిత్రం అమ్ముడు పోతుంది. నైజాం ఏరియాలో ఈ చిత్రం ఏకంగా 22 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ గతంలో నటించిన ఏ చిత్రం కూడా నైజాం ఏరియాలో 15 కోట్లకు మించి వసూళ్లు చేసింది లేదు. కాని ఈ చిత్రంపై ఉన్న నమ్మకం మరియు క్రేజ్‌ నేపథ్యంలో ఏకంగా 22 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. సింపుల్‌గా ఈ చిత్రం 25 కోట్లను నైజాం ఏరియాలో వసూళ్లు చేస్తుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. క్యాంటీన్‌ ప్రసాద్‌ అదే నమ్మకంతో సినిమా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను దక్కించుకున్నాడు. 25 కోట్లు వసూళ్లు చేస్తుందనే నమ్మకం తనకు ఉందని, తప్పకుండా బన్నీ కెరీర్‌లో ఈ చిత్రం నిలిచి పోతుందని డిస్ట్రిబ్యూటర్‌ ప్రసాద్‌ అంటున్నాడు. మొత్తానికి ఈ చిత్రం బిజినెస్‌ పరంగా అందరికి షాక్‌ ఇస్తుంది.