పరుగెత్తే ప్ర‌తివాడూ పారిపోతున్నట్టు కాదు

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

yuddham sharanam movie theatrical trailer

నాగ‌చైత‌న్య లావ‌ణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న యుద్ధం శ‌ర‌ణం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ యూత్ ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ప‌రుగెత్తే ప్ర‌తీవాడు పారిపోతున్న‌ట్టు కాదు అంటూ నాగ‌చైత‌న్య చెప్పిన డైలాగ్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. కుటుంబంతో సంతోషంగా ఉండే హీరో జీవితంలో ఓ క్రిమిన‌ల్ కార‌ణంగా జ‌రిగిన మార్పులు, హీరోకు ఎదుర‌యిన స‌మ‌స్య‌లు, వాటిని  ఎదుర్కొన్న విధాన‌మే యుద్ధం శ‌ర‌ణం సినిమా.

ఇందులో ప్ర‌ముఖ హీరో శ్రీకాంత్ విల‌న్ ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆడియో వేడుక‌లో సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. సెప్టెంబ‌రు 8 న సినిమా విడుద‌ల కానుంది. వారాహి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై ర‌జ‌నీ కొర్ర‌పాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌కు చిన్న‌నాటి నుంచి ఫ్రెండ్ అయిన కృష్ణ ఆర్‌. వి. మారిముత్తు ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించారు. సినిమా ఆడియో వేడుక‌లో త‌మ స్నేహా్న్ని అంద‌రికీ వివ‌రించాడు చైతు.

తాను, డైరెక్ట‌ర్ కృష్ణ ఒకే రోజు పుట్టామ‌ని, నాలుగో త‌ర‌గ‌తి నుంచి క‌లిసి చ‌దువుకున్నామ‌ని తెలిపారు. ఎనిమిదో త‌ర‌గ‌తిలోనే త‌మ ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధం మొద‌ల‌యింద‌ని,   కృష్ణ‌తో పోటీప‌డి ఓ అమ్మాయి మ‌నసు గెలుచుకున్నాన‌ని, ఆ యుద్ధంలో తాను గెలుపొందాన‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. అప్ప‌టి ప్రేమ‌యుద్దంలో తాను గెలిచినా… యుద్ధం శ‌ర‌ణం విష‌యంలో మాత్రం ద‌ర్శ‌కుడిగా కృష్ణ గెలుస్తాడ‌ని చైతు అన్నారు. సినిమా రిలీజ్ కు ముందు  రెండు తెలుగు రాష్ట్రాల్లో వినూత్న రితీలో చిత్ర ప్ర‌చారం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.


మరిన్ని వార్తలు:

కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై పవన్‌ స్పందన?

అర్జున్‌ రెడ్డిపై సమంత కామెంట్స్‌

భోగ‌న్ రీమేక్ లో మాస్ మ‌హారాజ‌