2019 టీడీపీ స్టార్ క్యాంపైనర్స్ జగన్,రోజా .

Somireddy chandramohan reddy comments on Jagan and Roja

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
Ycp ఘోర పరాజయంతో నంద్యాల ఉప ఎన్నికల పర్వం ముగిసింది. ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశానిస్పృహల్లో మునిగిపోయాయి. అటు ఫలితాలు చూసి టీడీపీ శ్రేణులు, నాయకులూ పండగ చేసుకుంటున్నారు. అయితే నంద్యాల గెలుపులో టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలకు ఎంత క్రెడిట్ ఇస్తున్నారో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకురాలు రోజాకి అంతే క్రెడిట్ ఇస్తున్నారు. ఆ ఇద్దరు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం వల్లే టీడీపీ అనుకున్న దాని కంటే భారీ మెజారిటీ సాధించగలిగిందని టీడీపీ నాయకులే అంటున్నారు. ఇక నంద్యాల ఉపఎన్నికల పర్యవేక్షణకు అక్కడే మకాం వేసిన మంత్రి చంద్రమోహన్ రెడ్డి కూడా జగన్, రోజా నోటిదూకుడు మీదే మాట్లాడారు.

2019 ఎన్నికల్లో ఆ ఇద్దరూ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తే టీడీపీ తేలిగ్గా గెలిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో వున్నాయి. అందుకే 2019 లో టీడీపీ తరపున స్టార్ క్యాంపైనర్స్ జగన్, రోజా అని చురకలు వేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు సరదాకి అంటున్నా పరిస్థితి చూసి వీళ్లిద్దరి వల్లే జనం దూరం అవుతున్నారని వైసీపీ శ్రేణులు నెత్తినోరు బాదుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు:

నంద్యాల పోతే 2019 కష్టమే.

ఇల్లు, పిల్లలే ఆ నాయకుల లక్ష్యం … అదే మోడీకి వరం?

మన్మోహన్ కంటే మోడీనే దారుణమా..?