సుశాంత్ ప్రొడ్యూసర్ మీద నాగసుశీల కేసు…

Naga Susheela Files sign forgery Case on Chintalapudi Srinivasa Rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని కుటుంబానికి చెందిన నటుల్లో సుశాంత్ ఒకరు. ఈ హీరో ఇప్పటిదాకా సక్సెస్ ఫుల్ సినిమాలు తీయలేకపోయారు. అయినా ఆయనతో మెజారిటీ సినిమాలు తీసింది చింతలపూడి శ్రీనివాసరావు అనే నిర్మాత. ఆయన మీద సుశాంత్ తల్లి, నాగార్జున సోదరి అయిన నాగసుశీల పోలీస్ కేసు పెట్టడంతో ఫిలిం నగర్ ఆశ్చర్యపోతోంది. హైదరాబాద్ నడిబొడ్డున వున్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆమె శ్రీనివాస్ మీద ఫిర్యాదు చేశారు. తన సంతకం ఫోర్జరీ చేసి అనుమతి లేకుండా తన భూములు శ్రీనివాసరావు అమ్మినట్టు నాగసుశీల పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నాగసుశీల ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాస్ కోసం వెదుకుతున్నారు.

Naga Susheela sushanth and chintalapudi srinivasa rao

నాగసుశీల ఫిర్యాదు తర్వాత శ్రీనివాసరావుకు సంబండించిన మరికొన్ని అంశాలు కూడా బయటికి వస్తాయని నాగసుశీల తరపు మనుషులు చెబుతున్నారు. గతంలో ఓ సారి సుశాంత్ సైతం చింతలపూడి వ్యవహారశైలి మీద ఫైర్ అయినట్టు తెలుస్తోంది. సుశాంత్ తో చేసిన సినిమాల ఆర్ధిక లావాదేవీల్లో వున్న విభేదాలు వల్లే శ్రీనివాస్ మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన సన్నిహితులు అంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒకప్పుడు పాలునీళ్లలా కలిసిపోయినట్టు కనిపించిన ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు ఉప్పునిప్పులా కొట్లాడ్డం చూస్తుంటే డబ్బు మహత్యాన్ని కొనియాడకుండా ఎలా ఉండగలం?.