ఎన్టీఆర్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రం షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ను పూర్తి చేసే పనిలో ఉన్న దర్శకుడు త్వరలోనే పాటల కోసం విదేశాలకు వెళ్లబోతున్నాడు. పాటల చిత్రీకరణతో చిత్రాన్ని పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సినిమాను స్పీడ్గా పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.
‘అరవింద సమేత’ చిత్రంను సెప్టెంబర్ 20 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. షూటింగ్కు కేవలం 40 రోజులు మాత్రమే ఉందని, అందులో 30 రోజుల పాటు పాటల చిత్రీకరణకు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు ఏమాత్రం బ్రేక్ లేకుండా సినిమాను పూర్తి చేయాలని, ఆదివారాలు కూడా చిత్రీకరణ చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించాడు. అయితే చిత్రం విడుదల చేయాలని హడావుడి చేసి కాస్త క్వాలిటీ లేకుండా చేస్తుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో షూటింగ్ను డొలిపేస్తాడా అంటూ నందమూరి అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు. ఈ చిత్రంపై నందమూరి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం వారి అంచనాలను అందుకునేలా ఉంటుందా అనేది చూడాలి.