Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్ హీరోల వారసులకు మాత్రమే భారీ ఎంట్రీ దక్కుతుంది. కాని నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు అయిన శ్రీనివాస్కు కూడా మంచి ఎంట్రీ దక్కింది. మొదటి సినిమానే వినాయక్ దర్శకత్వంలో చేయడంతో పాటు ఆ చిత్రంలో సమంత హీరోయిన్గా నటించి, తమన్నా ఐటెం సాంగ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగా, మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు కమర్షియల్ హీరోగా పేరు వచ్చింది. ఆ చిత్రం తర్వాత ఈయన చేస్తున్న ప్రతి సినిమాలో కూడా స్టార్ హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తున్నాడు. స్టార్ హీరోయిన్లతో ఈయన సినిమాలు చేస్తున్న కారణంగా భారీగా అంచనాలు పెరిగి ఈయన చేస్తున్న ప్రతి సినిమాకు క్రేజ్ దక్కింది.
తాజాగా ఈ హీరో చేస్తున్న సినిమాకు స్టార్ హీరోయిన్తో పాటు ఒక ప్రముఖ విలన్ను కూడా ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం సాహో చిత్రంలో ప్రభాస్తో ఢీ కొడుతున్న విలన్ నీల్ నితన్ను బ్లెంకొండ హీరో సినిమాకు ఎంపిక చేయడం జరిగింది. దాదాపు రెండున్నర కోట్లు ఇచ్చి మరీ ఈ విలన్ను ఎంపిక చేయడం జరిగింది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్టార్ హీరోయిన్తో పాటు నీల్ నితిన్ వంటి స్టార్ను ఎంపిక చేయడంతో సినిమా బడ్జెట్ అమాంతం పెరిగి పోతుంది. ఎంత విజయం సాధించిన కూడా ఈయన నటించే సినిమాలు పాతిక కోట్లకు మించి వసూళ్లు చేయడం గగనమే. ఇలాంటి సమయంలో మరీ ఆ రేంజ్ విలన్ అవసరమా అంటే కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.