దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న క్రిష్ ఈ చిత్రాన్ని కూడా చాలా స్పెషల్గా తీసుకున్నాడు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిపబ్లిక్డే సందర్భంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చిత్రీకరణ చకాచకా జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో తనయుడు బాలక్రిష్ణ నటిస్తున్నాడు. హరిక్రిష్ణ పాత్రలో తనయుడు కళ్యాణ్రామ్ నటిస్తున్నారు. శ్రీదేవిగా రకుల్, జయప్రదగా తమన్నాలు కనిపించనున్నారు.
‘ఎన్టీఆర్’ బయెపిక్లో యంగ్టైగర్ ఎన్టీఆర్ కూడా నటించనున్నాడు అనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గోనడం లేదు కాబట్టి ఎన్టీఆర్ కనబడకుండా కేవలం వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ వార్తలకు దర్శకుడు క్రిష్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఎన్టీఆర్’ చిత్రంలోని పాత్రలు అన్నీ కూడా ఇప్పటికే ఫుల్ఫిల్ అయ్యాయని, వాయిస్ ఓవర్ ఏమి లేదని, ‘ఎన్టీఆర్’ చిత్రం కోసం అసలు జూ.ఎన్టీఆర్ను చిత్ర యూనిట్ సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ లేడు అనగానే నందమూరి అభిమానులు కాస్త నిరాశపడుతున్నారు. ఈ చిత్రంలో యంగ్టైగర్ కూడా ఉంటే ప్రత్యేక ఆకర్షణగా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు.