‘ఒక్క క్షణం’కు ఇవి కలిసొచ్చే అంశాలు

okka-kshanam-movie-highligh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు శిరీష్‌ హీరోగా వి ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్క క్షణం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఒక్క క్షణం’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు ఉన్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో దర్శకుడిగా ఒక మంచి గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు వి ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వినూత్య కథాంశంతో, హర్రర్‌ నేపథ్యంలో రూపొందిన ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అల్లు శిరీష్‌తో కూడా అదే తరహా కథాంశంతో హర్రర్‌ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించాడు.

allusirish-new-movie

ట్రైలర్‌ మరియు టీజర్‌లు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అల్లు శిరీష్‌కు ఇప్పటి వరకు ఒక మంచి కమర్షియల్‌ సక్సెస్‌ పడలేదు. ఈ చిత్రం అయినా అల్లు శిరీష్‌కు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సురభి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. రెండు జంటల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ నడుస్తుంది. ఒక జంట జీవితంలో జరిగిన విషయాలు, మరో జంటకు జరుగుతుంటాయి.

latest-news-on-allusrish

ట్రైలర్‌లో చూపించిన ఈ పాయింట్‌ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాపై ఆసక్తి ఉంది, దాంతో పాటు గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు చిత్రాలు కూడా యావరేజ్‌ టాక్‌తో నడుస్తున్నాయి. ఒక వేళ ‘ఒక్కక్షణం’ చిత్రం సక్సెస్‌ అయితే తప్పకుండా భారీ కలెక్షన్స్‌ను సాధించడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. వరుసగా సెలవులు మరియు సినిమాకు పాజిటివ్‌ అంచనాలున్నాయి. ఈ రెండు కూడా అల్లు శిరీష్‌కు కలిసి వచ్చే అంశాలు. ఈ కలిసి వచ్చే అంశాతో శిరీష్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.