Peddi: పెద్ది’ మేనియాతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.. 100 మిలియన్ మైలురాయి దాటేసింది..!

peddi: పెద్ది’ మేనియాతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.. 100 మిలియన్ మైలురాయి దాటేసింది..!
peddi: పెద్ది’ మేనియాతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.. 100 మిలియన్ మైలురాయి దాటేసింది..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా, ప్రమోషన్స్‌లో భాగంగా మే 18న విడుదలైన ట్రైలర్ క్షణాల్లోనే ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.

యూట్యూబ్‌తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ట్రైలర్ సునామీలా దూసుకెళ్లింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ట్రైలర్ ఏకంగా 101 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించబడిన తెలుగు ట్రైలర్‌గా ‘పెద్ది’ పేరు నిలిచింది. రామ్ చరణ్ ఊరమాస్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్, అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను నేషనల్ స్థాయిలో ట్రెండింగ్‌లో నిలిపాయి.

ఈ పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్‌కు వచ్చిన ఈ అద్భుత స్పందనతో ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు థియేటర్లలో ఈ మేనియా ఎలా పేలబోతోందో చూడాల్సిందే.