Political Updates: దిల్లీలో ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి విందు

Political Updates: CM Revanth's historic decision.. BC communities rejoice
Political Updates: CM Revanth's historic decision.. BC communities rejoice

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రోజున దిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన హైకమాండ్ నేతలను కలిసి పలు విషయాలు చర్చించారు. అలాగే గత నాలుగున్నరేళ్లుగా పార్లమెంటులో తనతో కలిసి పనిచేసిన వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం రాత్రి దిల్లీలో విందు ఇచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఈ విందులో కాంగ్రెస్‌కు చెందిన మాణికం ఠాగూర్‌, కార్తీ చిదంబరం, ఎంపీ శశి థరూర్‌, గౌరవ్‌ గొగొయ్‌, దీపేందర్‌ హుడా, రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ, హిబి ఇడెన్‌, బీజేపీ నుంచి సీఎం రమేశ్‌, టీడీపీకి చెందిన గల్లా జయదేవ్‌, టీఎంసీకి చెందిన సౌగత్‌ రాయ్‌, ఎన్‌సీపీకి చెందిన ప్రఫుల్‌ పటేల్‌, డీఎంకేకు చెందిన కళానిధి, బీఎస్పీకి చెందిన డానిష్‌ అలీ, రితేశ్‌ పాండే, వైఎస్సార్సీపీకి చెందిన వల్లభనేని బాలశౌరి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, వేంరెడ్డి ప్రభాకరరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్‌రావు, వంగా గీత, చింతా అనూరాధ, బీశెట్టి వెంకటసత్యవతి, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్‌, ఆదాల ప్రభాకరరెడ్డితోపాటు రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.