మళ్లీ ఆమెను బుక్‌ చేసిన దిల్‌రాజు

pooja hegde to romance with nithin for srinivasa kalyanam movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దిల్‌రాజుకు ఏ కథకు ఏ హీరో బాగా సూట్‌ అవుతాడు, ఏ హీరోను ఏ దర్శకుడు బాగా చూపించగలడు అనే విషయాలపై అవగాహణ ఎక్కువ. ఆయన సెలక్షన్‌ ఇంత వరకు ఎప్పుడు కూడా మిస్‌ కాలేదు. ఆయన తీసిన, తీస్తున్న సినిమాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గత సంక్రాంతికి ‘శతమానంభవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిల్‌రాజు ఆ దర్శకుడితో మరో సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ‘శతమానంభవతి’ చిత్ర దర్శకుడు సతీష్‌ వేగేశ్న ప్రస్తుతం ‘శ్రీనివాస కళ్యాణం’ అనే చిత్రాన్ని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. సతీష్‌ వేగేశ్న సిద్దం చేసిన కథకు హీరో నితిన్‌ అయితే బాగుంటుందని దిల్‌రాజు భావించాడు. ఇప్పటికే దిల్‌రాజు బ్యానర్‌లో నితిన్‌ హీరోగా శ్రీనివాస కళ్యాణం కన్ఫర్మ్‌ అయ్యింది.

hero-nithin

వచ్చే ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా హీరోయిన్‌ పూజా హెగ్డేను ఎంపిక చేయడం జరిగింది. కోటికి పైగా డిమాండ్‌ చేస్తున్నా కూడా ఆమెను ఈ చిత్రం కోసం దిల్‌రాజు బుక్‌ చేశాడు. నితిన్‌కు జోడీగా పూజా హెగ్డే ఆకట్టుకుంటుందని, ‘శ్రీనివాసకళ్యాణం’ కథలో హీరోయిన్‌ పాత్రకు పూజా హెగ్డే సరిగ్గా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో దిల్‌రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం బెల్లకొండ హీరోతో ఈ అమ్మడు ఒక చిత్రాన్ని చేస్తోంది. ‘డీజే’ చిత్రంతో పూజా హెగ్డేకు భారీ క్రేజ్‌ దక్కింది. దాంతో ఈమె పారితోషికం అమాంతం పెంచేసింది. హీరోయిన్స్‌ పారితోషికం విషయంలో ఆచి తూచి వ్యవహరించే దిల్‌రాజు పాత్ర ప్రాముఖ్యత దృష్టిలో పెట్టుకుని పూజా హెగ్డే పారితోషికం ఎక్కువ అయినా పర్వాలేదని ఆమెను ఎంపిక చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం చివర్లో ‘శ్రీనివాసకళ్యాణం’ను విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.