మొదలెట్టేశాను అంటూ ప్రకటించిన ప్రభాస్‌

prabhas-facebook-posting-about-sahoo-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాలుగున్న సంవత్సరాల పాటు ‘బాహుబలి’ శ్వాసగా జీవించిన ప్రభాస్‌ ఎట్టకేలకు కొత్త ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాడు. ‘మిర్చి’ తర్వాత ‘బాహుబలి’ కోసం అయిదు సంవత్సరాలు కేటాయించిన ప్రభాస్‌ తాజాగా ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు విడుదలైన తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోలను సైతం క్రాస్‌ చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ‘బాహుబలి 2’ విడుదలైనప్పటి నుండి కూడా ‘సాహో’ చిత్రం షూటింగ్‌లో ప్రభాస్‌ ఎప్పుడెప్పుడు పాల్గొంటాడా అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నేడు ప్రభాస్‌ సాహో చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. 

సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘సాహో’. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అయితే ప్రభాస్‌ లేకుండా ఇన్ని రోజుల చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు ప్రభాస్‌ జాయిన్‌ అయ్యాడు. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో ఒక అద్బుతమైన సెట్టింగ్‌ను 5 కోట్లతో వేయించడం జరిగింది. ఆ సెట్టింగ్‌లో షూటింగ్‌ జరుగుతుంది. ఆ షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ ద్వారా షేర్‌ చేయడం జరిగింది. నాలుగున్నర సంవత్సరాల ‘బాహుబలి’ జర్నీ తర్వాత కొత్త యాక్షన్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాను, అదే సాహో అంటూ ప్రభాస్‌ చేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రద్దా కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో దుబాయిలో జరుగబోతున్న షూటింగ్‌లో ఆమె ప్రభాస్‌తో జత కట్టనుంది.

మరిన్ని వార్తలు:

‘జై లవకుశ’ ఆడియో డేట్‌ ఫిక్స్‌