ప్రభాస్‌ 100 కోట్లు తగ్గడం లేదుగా..!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రస్తుతం ‘సాహో’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ వారు సుజీత్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రం తర్వాత వరుసగా ప్రభాస్‌ చేస్తున్న చిత్రాల బడ్జెట్‌లు ఆకాశంలో ఉంటున్నాయి. సాహో చిత్రం తర్వాత ప్రభాస్‌ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే ఆ విషయమై అధికారిక ప్రకటన చేశాడు. ఇక ఈ చిత్రం బడ్జెట్‌ విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

prabhas and director radha krishna

ప్రభాస్‌ త్రి భాష చిత్రంగా తెరకెక్కుతున్న ఆ చిత్రంకు 150 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. 1970 నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం భారీ ఎత్తున సెట్స్‌ను నిర్మిస్తున్నారు. ఏకంగా 50 కోట్లను సెట్స్‌ కోసం ఖర్చు చేస్తున్నారట. ప్రస్తుతం సినిమా కోసం లొకేసన్స్‌ను వెదికే పనిలో ఉన్న దర్శకుడు అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుంది. వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2020వ సంవత్సరంలో ప్రభాస్‌, రాధాకృష్ణల చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాహో చిత్రంను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. వరుసగా ప్రభాస్‌ 100 కోట్లకు మించిన బడ్జెట్‌తో రూపొందుతున్నాయి.