జపానుకు బయలుదేరిన ‘పుష్ప-2’ టీమ్

జపానుకు బయలుదేరిన ‘పుష్ప-2’ టీమ్
Cinema News

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ పుష్ప-2 . ఈ మూవీ లో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ కి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

జపానుకు బయలుదేరిన  ‘పుష్ప-2’ టీమ్
Pushpa-2

తాజాగా చిత్ర యూనిట్ మూవీ షూటింగ్ ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో కీలకమైన సుదీర్ఘ షెడ్యూల్ చిత్రీకరణ కోసం జపాన్ వెళ్లనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15కే విడుదల చేయాలని అల్లు అర్జున్ హుకుం జారీ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.పుష్ప-ది రైజ్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ లో తగ్గేదేలే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే.