రాజమౌళికి చైతూ సినిమా నచ్చలేదు

rajamouli-negative-tweets-on-yuddham-sharanam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల ఏ సినిమా విడుదలైనా కూడా రాజమౌళి చూసి రివ్యూ ఇవ్వడం పరిపాటి అయ్యింది. ‘బాహుబలి 2’ విడుదలైన తర్వాత పూర్తిగా రెస్ట్‌ తీసుకుంటున్న రాజమౌళి వచ్చిన ప్రతి సినిమాను చూసేస్తున్నాడు. ఇక చూసిన ప్రతి సినిమాపై తనదైన శైలిలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా తనకు సన్నిహితులైన వారి సినిమాలను మొదటి రోజు మొదటి ఆటలోనే చూడటం రాజమౌళికి అలవాటు. ఇక తనతో ‘ఈగ’ సినిమా నిర్మించిన సాయి కొర్రపాటి నిర్మాణంలో వచ్చే ప్రతి సినిమాను చూడటం ప్రశంసలు కురిపించడం రాజమౌళి పనైపోయింది.

ఇటీవల ‘పటేల్‌సర్‌’, ‘రెండు రెళ్లు ఆరు’ సినిమాలు సాయి కొర్రపాటి నిర్మాణంలో వచ్చాయి. ఆ సినిమాలు యావరేజ్‌గా ఉన్నా కూడా చాలా బాగున్నాయి అంటూ రివ్యూ ఇచ్చాడు. తాజాగా సాయి కొర్రపాటి నిర్మాణంలో నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా వచ్చిన ‘యుద్దం శరణం’ చిత్రాన్ని కూడా రాజమౌళి చూసేశాడు. అయితే ఈసారి మాత్రం సినిమాపై ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు. కారణం సినిమా ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. ప్రేక్షకులు తిరష్కరించిన నేపథ్యంలో రాజమౌళి పాజిటివ్‌ ట్వీట్‌ ఇస్తే తనపై నమ్మకం పోతుందనే ఉద్దేశ్యంతో ఇలా చేసినట్లుగా సినీ వర్గాల వారు భావిస్తున్నారు. రాజమౌళి ఇటీవల ‘అర్జున్‌ రెడ్డి’ ఒక అద్బుతమైన సినిమా అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

మరిన్ని వార్తలు:

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం

మహేష్‌తో ఎన్టీఆర్‌ ఢీ.. నిలిచేనా?