తారక్‌, చరణ్‌లకు నెల రోజులు పరీక్ష

rajamouli put conditions to NTR and Ramcharan for multistarrer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా, నందమూరి హీరోల మల్టీస్టారర్‌ చిత్రంకు మెల్ల మెల్లగా ఏర్పాట్లు చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే స్టోరీ సిద్దం అయ్యిందని, ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు చాలా విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా చాలా పక్కాగా, పగడ్బందీగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తాడు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని, ఆ తర్వాత సెట్స్‌ పైకి వెళ్తాడు. అంత పక్కాగా ప్రణాళిక బద్దంగా సినిమాలను చేస్తాడు కనుకే ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చింది.

ఇండియన్‌ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను దక్కించుకున్న రాజమౌళి తన తర్వాత సినిమా మల్టీస్టారర్‌గా చేయాలనుకోవడంతో ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ఈ చిత్రంలో నటించనున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నుండి సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చరణ్‌, ఎన్టీఆర్‌లకు రాజమౌళి నెల రోజుల పాటు పరీక్ష పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. తన కథకు తగ్గ పాత్రల్లోకి వీరిద్దరిని మల్చుకోవడానికి రాజమౌళి వీరిద్దరికి నెల రోజుల పాటు వర్క్‌ షాప్‌ నిర్వహించనున్నాడట. ఆ నెల రోజుల్లో ఇద్దరు చాలా సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేయబోతున్నారు. వీరిద్దరికి ఆ నెల రోజులు పరీక్ష అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.