శ్రీనుకు మళ్లీ ఓకే చెప్పింది

Rakul Preet Singh Okay Again Bellamkonda

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో గత సంవత్సరం వరకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం పెద్దగా ఆఫర్లను రాబట్టడంలో విఫలం అవుతుంది. మహేష్‌బాబు, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇలా పలువురు స్టార్‌ హీరోలతో నటించిన ఈ అమ్మడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి ‘జయ జానకి నాయక’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. స్టార్‌ ఇమేజ్‌ ఉన్న సమయంలో బెల్లంకొండతో నటించేందుకు ఓకే చెప్పినందుకు గాను ఈ అమ్మడికి ఏకంగా 2 కోట్ల మేరకు పారితోషికం దక్కినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఇద్దరి కాంబోకు మంచి పేరు వచ్చింది. అందుకే మరోసారి వీరి కాంబో రిపీట్‌ కాబోతుంది.

ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా సాక్ష్యం చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. వరుసగా స్టార్‌ హీరోయిన్స్‌కు గురి పెడుతున్న ఈ యువ హీరోతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మళ్లీ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో రెండవ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాకు గాను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 1.5 కోట్లను అందుకోబోతుంది. గతంతో పోల్చితే ఈసారి అంతగా క్రేజ్‌ లేదు కనుక తక్కువ పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమద్య ఒక ప్రముఖ నాయకుడి కొడుకుతో నటించేందుకు నో చెప్పిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బెల్లంకొండతో నటించేందుకు మాత్రం వరుసగా ఓకే చెబుతుంది. మూడు కోట్ల ఆఫర్‌ను సైతం కాదన్న రకుల్‌ ఎందుకు రెండవ సారి కూడా బెల్లంకొండకు ఓకే చెప్పింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.