ఉపాసన మంచి మనస్సు.. స్టార్స్‌ను దాటిపోయింది

Ram Charan, Upasana donate Rs. 1.25 Cr kerala floods

కేరళను భారీ ఎత్తున వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు గత కొన్ని రోజులుగా నీళ్లలోనే ఉన్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వేలాది మంది ఆహారం లేకపోవడంతో అల్లాడుతున్నారు. కేరళ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది. ఈ సమయంలోనే తెలుగు సినీ తారలు తమకు తోచినంత సాయంను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కేరళ సీఎం సహాయ నిధికి అల్లు అర్జున్‌ ఏకంగా 25 లక్షల సాయంను ప్రకటించిన విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ 5 లక్షలు ఇంకా పలువురు వారికి తోచిన మొత్తంను ప్రకటించారు. అయితే తెలుగు స్టార్స్‌ అందరిలోకంటే ఉపాసన రామ్‌ చరణ్‌ భారీ ఎత్తున విరాళంను కేరళ ప్రజలకు ఇవ్వడం జరిగింది.

Ram Charan, Upasana

కేరళ వరద బాధితుల సహాయార్థం ఉపాసన 60 లక్షల రూపాయలతో పాటు, 10 టన్నుల బియ్య మరియు భారీ ఎత్తున వాటర్‌ ప్యాకెట్స్‌ను కేరళ పంపిస్తున్నారు. ఆర్థిక సాయం మరియు బియ్యం కలిపి మొత్తంగా 1.25 కోట్లు అంటూ సమాచారం అందుతుంది. కోటి రూపాయల సాయం అంటే మామూలు విషయం కాదు. వందల కోట్ల ఆస్తులు ఉన్న వారు కూడా తమకెందుకులే అని వదిలేస్తారు. కాని ఉపాసన మాత్రం కేరళపై అభిమానంతో, ఆపదలో ఉన్న వారికి సాయంగా నిలవాలనే ఉద్దేశ్యంతో భారీ మొత్తంలో సాయం చేయడం అభినందనీయం. ఉపాసన మరియు రామ్‌ చరణ్‌లు చేసిన సాయం ఇతర స్టార్స్‌కు ఆదర్శం అవ్వాలని మనం కోరుకుందాం.

upasana