దారుణం…తొమ్మిది నెలల పసికందు మీద రేప్

rape on nine months baby

తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేసిన దారుణ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో ఉద్రిక్తతలకి దారి తీసింది. హన్మకొండలోని టైలర్ స్ట్రీట్‌ పాలజెండాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే జక్కోజీ జగన్, రచన దంపతులకు వివాహమైన మూడేళ్ల తరువాత శ్రిత అనే పాప జన్మించింది ఆమె వయసు 9నెలలు. తల్లితండ్రులు మంగళవారం రాత్రి రెండో అంతస్తులో డాబాపై నిద్రిస్తున్న క్రమంలో కొలేపాక ప్రవీణ్ (28)అనే వ్యక్తి పాపను ఎత్తుకెళ్లి అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడి చిన్నారిని హత్య చేసినట్టు తెలుస్తోంది. బుధవారం తెల్లవారు జామున స్పృహ తప్పిపడిపోయిన పాపను హూటాహుటిన హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పాప మృతదేహాని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు కారకుడైన ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీఎంమార్చురీ వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రిత హత్యకు నిరసనగా మహిళలు, యువకులు అశోక జంక్షన్‌లో మానవహారం వేసి ఆందోళనకు దిగారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, లేదంటే తమకు  అప్పగించండి అంటూ కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. నిందితుడికి శిక్ష పడే వరకు పాప మృతదేహాన్ని దహనం చేయమంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సర్ది చెప్పుతున్నారు.