చెల్లెలిని గర్భవతిని చేసిన కామాంధుడు

rape on sister
గుంటూరు జిల్లా తెనాలిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. వావివరుసలు మరిచిన ఓ కామాంధుడు చెల్లి మీదనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో భార్య లేనప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడిన ఆ నీచుడు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరకు బాధితురాలు గర్భం దాల్చడంతో ఆ కామాంధుడి దుర్మాగం బయటపడింది. వివరాల్లోకి వెళితే తెనాలిలో నివసించే పేద దంపతులకు ఓ కుమార్తె ఉంది. భార్యభర్తలిద్దరూ పొట్టకూటి కోసం తోట కాపలా పనికి వెళ్తుంటారు. ఇంట్లో బాలిక ఒక్కతే ఉండటం అంత మంచిది కాదని భావించి కొల్లూరు మండలం దోనేపూడిలోని తమ బంధువుల ఇంట్లో ఉంచి ఆ గ్రామంలోని బడికి పంపిస్తున్నారు. ఆ ఇంట్లోని వారు దంపతులు బాలికకు వరుసకు అన్న, వదిన అవుతారు. కొద్దిరోజులు బాగానే ఉన్న బంధువు తర్వాత బాలికపై కన్నేశాడు. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకుని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. చాలాసార్లు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏప్రిల్ 11వ తేదీన బాలికపై అత్యాచారయత్నం చేయగా తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను ఎలాగైనా అనుభవించాలన్న కోరిక అతడిలో మరింత బలపడింది. మే నెలలో ఓ రోజు రేషన్‌ కార్డు దరఖాస్తు కోసమని భార్యను తెనాలి పంపించాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఒంటరిగా ఉన్న బాలికపై పశువాంఛ తీర్చుకున్నాడు. ఆమెను మంచంపై పడేసి చేతులు, కాళ్లు కట్టేసి అరవకుండా నోట్లో వస్త్రాలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను చేసిన పని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక మిన్నకుండిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని కామాంధుడు సమయం చిక్కినప్పుడల్లా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. అయితే బుధవారం బాలికకు కడుపునొప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులు తెనాలిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు ఆమె గర్భం దాల్చినట్లు చెప్పడంతో ఏం జరిగిందని తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో విషయం బయటకు వచ్చింది. దీంతో షాకైన తల్లిదండ్రులు గురువారం కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.