కెసిఆర్ పై చెలరేగిన రేవంత్ రెడ్డి.

తెలంగాణాలో ఎన్నికలకి సమయం దగ్గర పడుతుంది. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగడంతో రోజు రోజుకి వాతావరణం వేడెక్కుతుంది. తాజాగా తెరాస మాజీ ఎంపీ బాల్క సుమన్ అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డి ని దూషించిన విధానం తెలంగాణ ప్రజలలో అసంతృప్తి ని కలిగిస్తుంది. వీటితో పాటు, రోజు రోజుకి ప్రజాకూటమి బలం పుంజుకోవడం తో తెరాస శ్రేణులలో కూడా ఆందోళన కలిగిస్తుంది. వీటికి తోడు, ప్రచారాలకు దిగిన తెరాస మాజీ నేతలకి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది.

కెసిఆర్ పై చెలరేగిన రేవంత్ రెడ్డి. - Telugu Bullet

ఈ సమయంలో, రేవంత్ రెడ్డి తెరాస పై మరో ఆరోపణతో ముందుకు వచ్చాడు.తెరాస పార్టీ, ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కయ్యారని, ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్ బాక్స్ లకు గులాబీ రంగును వాడడంతో వారు పరోక్షంగా తెరాస కి ప్రచారం చేస్తున్నట్టేనని మీడియా ముందు వాఖ్యానించారు. అంతేకాకుండా, తెరాస పార్టీ మీడియాని బెదిరించి తన గుప్పిట్లో పెట్టుకుందని, అందుకు నిదర్శనం ప్రముఖ పత్రికలు, ప్రముఖ చానెళ్లు తెరాస పార్టీ కి కల్పిస్తున్న విపరీతమైన ప్రచారమే సాక్ష్యం అని ఆరోపించారు. తెరాస కి సంబంధించిన ఏ వార్త అయినా ముందు పేజీలలో, పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురిస్తున్నారని, ఆ సమయంలో రాష్ట్రంలో ఏమి జరిగిన, ఎవరు వచ్చి వెళ్ళినా ఆ వార్త చివరి పేజీలలోని కూసింత జాగాలో ఉంటుందని ఎద్దేవా చేశారు.