మళ్లీ అదే చెప్పిన నమ్రత

rumors-on-namrata-mahesh-re-entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు భార్య నమ్రత మాజీ మిస్‌ ఇండియాతో పాటు బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసిన స్టార్‌ హీరోయిన్‌ అనే విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో కూడా చిరంజీవితో ‘అంజి’ చిత్రంలో నటించి మెప్పించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో నమ్రత నటించింది లేదు. మహేష్‌బాబును పెళ్లి చేసుకున్న తర్వాత హిందీ చిత్రాలను కూడా నమ్రత వదిలేశారు. పిల్లలు పెద్ద వారు అయ్యారు, ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేయబోతుందని కొన్ని నెలల క్రితం వార్తలు జోరుగా వచ్చాయి. ఆ సమయంలోనే ఆమె స్పందిస్తూ తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న మాట నిజం కాదని, తనకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చారు.

నమ్రత అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ ఆమె రీ ఎంట్రీ గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తుంది. మహేష్‌బాబు నటించబోతున్న ఒక సినిమాలో నమ్రత ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వస్తున్న వార్తలకు మరోసారి నమ్రత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటీవలే మహేష్‌బాబు 25వ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నమ్రత మరోసారి మీడియాతో తన రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను కుటుంబ వ్యవహారాలు, మహేష్‌బాబు మూవీ డేట్స్‌, వ్యాపారం, ఇతరత్ర సేవా కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను అని, సినిమాలపై దృష్టి పెట్టే ఆలోచన అస్సలు లేదు అంటూ క్లారిటీగా చెప్పేసింది.

మరిన్ని వార్తలు:

చైతూ అడ్డు రాకుంటే సమంతను పెళ్లి చేసుకునేవాడిని..!

రవి తేజ ‘రాజా ది గ్రేట్’ టీజర్