పవన్‌ ఫ్యాన్స్‌ ‘డీజే’ను పైరసీ చేశారంటూ ఆరోపణలు

rumours on pawan kalyan fans about allu arjun dj movie piracy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకు పోతుంది. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్‌ను సాధించిన అల్లు అర్జున్‌ లాంగ్‌ రన్‌లో వంద కోట్ల గ్రాస్‌ను దక్కించుకోవడం ఖాయంగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఈ సమయంలోనే ‘డీజే’ పైరసీ అవ్వడం చిత్ర యూనిట్‌ సభ్యులకు నిరాశను కలిగిస్తుంది. సోషల్‌ మీడియాలో ‘డీజే’ ఫుల్‌ మూవీని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది. ఇప్పటికే చిత్రం మొత్తం కూడా వాట్సప్‌లో తెగ షేర్స్‌ అవుతున్నాయి. 

‘డీజే’ చిత్రం పైరసీ అవ్వడంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కొత్త వాదనను తెరపైకి తీసుకు వచ్చారు. అల్లు అర్జున్‌ అంటే ఇష్టం లేని పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కావాలని ‘డీజే’కు భారీ కలెక్షన్స్‌ రావద్దనే ఉద్దేశ్యంతో సినిమా మొత్తంను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వాట్సప్‌ లో కూడా సినిమాను వారే షేర్‌ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అదే విషయాన్ని లోలోపల అంటున్నారు. స్వయంగా దిల్‌రాజు సన్నిహితుల వద్ద ఈ విషయంపై స్పందిస్తూ పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రమే ఇలా చేస్తారు, వారే ‘డీజే’ సినిమాను ఆడుకుంటున్నారు అంటూ వాపోయాడట. మొత్తానికి ‘డీజే’ పైరసీ వివాదం పవన్‌ ఫ్యాన్స్‌ వద్దకు వచ్చి ఆగింది. ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది చూడాలి.

మరిన్ని వార్తలు