శర్వాతో గొడవపై సాయి పల్లవి క్లారిటీ….!

Sai Pallavi Gives Clarity on Sharwanand

మలయాళ ‘ప్రేమమ్‌’ చిత్రంతో సౌత్‌ ఆడియన్స్‌ను అలరించి ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మైమరపించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ‘ఫిదా’ చిత్రం తర్వాత నానితో కలిసి నటించిన ‘ఎంసీఏ’ చిత్రం కూడా ఈమెకు భారీ విజయాన్ని తెచ్చి పెట్టింది. వరుసగా రెండు విజయాలు దక్కిన నేపథ్యంలో తెలుగులో భారీగా ఆఫర్లు వస్తున్నాయి. స్టార్‌ హీరోలు సైతం ఈమెతో నటించేందుకు ఆసక్తి చూపించారు. కాని సాయి పల్లవి కాస్త పొగరుబోతు తనంతో ప్రవర్తిస్తుందని, స్టార్‌ హీరోయిన్‌లు కూడా కథలు వినకుండానే సినిమాలకు ఓకే చెబుతారు. కాని సాయి పల్లవి మాత్రం కథ మరియు తన పాత్ర బాగుంటేనే సినిమా చేస్తాను అంటూ మొండి పట్టుదలతో ఉంటుంది. ఇక ఈమె చేసే ప్రతి హీరోతో కూడా గొడవ పడుతుందని విమర్శలు ఎదుర్కొంటుంది.

‘ఎంసీఏ’ సమయంలో నానితో, ‘కణం’ చిత్రం షూటింగ్‌ సమయంలో నాగశౌర్యతో ఈమె గొడవ పడ్డట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె నటిస్తున్న పడి పడి లేచే మనసు చిత్రంలో హీరోగా నటిస్తున్న శర్వానంద్‌తో కూడా గొడవ పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. సాయి పల్లవితో గొడవ కారణంగా ఆయన షూటింగ్‌ నుండి అర్థాంతరంగా వెళ్లి పోయాడు అంటూ ప్రచారం మొదలైంది. తనపై వస్తున్న విమర్శలకు సాయి పల్లవి తాజాగా క్లారిటీ ఇచ్చింది. శర్వానంద్‌తో తాను గొడవ పడ్డట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు తాను శర్వాతో గొడవ పడ్డది లేదని, ఆయన వేరే సినిమా షూటింగ్‌ కోసం అని అర్థాంతరంగా వెళ్లిన కారణంగా అంతా కూడా గొడవ ప్రచారం చేస్తున్నారు అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. తాను గతంలో కూడా ఏ హీరోతో గొడవ పడ్డది లేదని, తన అభిప్రాయంను ముక్కుసూటిగా చెప్పడం వల్ల కొందరు దాన్ని గొడవగా భావిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.