‘సాక్ష్యం’ ప్రివ్యూ

Sakshyam Movie Preview

‘అల్లుడు శీను’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌ వరుసగా భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ కొత్త హీరోలకు కూడా దక్కని అరుదైన గుర్తింపు, రికార్డులను ఈ యువ హీరో దక్కించుకుంటూ పోతున్నాడు. ఇటీవలే ‘జయ జానకీ నాయక’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ తాజాగా ‘సాక్ష్యం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఈనెల 27న విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, యూ/ఎ సర్టిఫికెట్‌ను దక్కించుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్‌ను చేసింది.

పెద్ద హీరో సినిమాలను మాత్రమే కొనుగోలు చేసే ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ‘సాక్ష్యం’ చిత్రం హోల్‌సేల్‌ గా కొనుగోలు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు కూడా ఉన్నారు. సాక్ష్యం చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించడం వల్ల సినిమా స్థాయి ఇంకాస్త పెరిగింది. ఈమె వరుసగా తెలుగులో సూపర్‌ హిట్స్‌ను దక్కించుకుంటున్న కారణంగా ఈ చిత్రం కూడా విజయాన్ని దక్కించుకోవచ్చు అనే నమ్మకంతో ఉన్నారు. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.